Saturday 20 August 2016

ప్రశ్నలు - 1

శుభం.
మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానములు

౧ ప్రతిమంత్రానికి బీజం, శక్తి, కీలకం ఉంటాయని విన్నాను. ఈ మూడిటి స్వరూపం ఏమిటి? వీటిమధ్య భేదమేమిటి? ఏదేమిటో ఎలా తెలుస్తుంది? బీజశక్తికీలకాలు తెలియకపోవటం సాధకుని బాధిస్తుందా?

దీని గురించి ఇంతకు ముందే చెప్పడం జరిగినది. 
కారణ బిందువు నుండి ౧) కార్య బిందువు, ౨) అందుండి నాదము ౩) అందుండి బీజము అను మూడు పుట్టు చున్నవి. ఈ మూడును పర, స్థూల, సూక్ష్మ పదముల చే చెప్పబడు చున్నవి. కాబట్టి బిందువు స్థూల, సూక్ష్మ, పరమని మూడు విధములుగా చెప్ప బడుచున్నవి. బిందువు గురించి తెలిస్తే బీజము గురించి తెల్సినట్లే.  బిందువే బీజమునకు  మూలము.. ఇవన్నీ అతి రహస్యములు గురు-శిష్య పర౦పర ద్వారా తెలుసుకోదగిన విషయములు. ఉపాసన, ఉపదేశం లేని వారికి ఈ బీజ శక్తి కీలకములు లేకుండా చేయడం ఉత్తమం. బీజ సహితముగా చేయడం వలన తొందరగా మంత్రము సిద్దించును. బీజ రహితముగా చేసినందువలన సాధకునికి ఎటువంటి ఇబ్బంది లేదు, వచ్చే ప్రమాదము లేదు. పట్టు తొందరగా కుదరదు అంతే. బీజ శక్తి కీలకములను ఉపదేశము ద్వారా, దీక్ష ద్వారా గురువులు తమ శిష్యులకు మంత్రమును ఇచ్చెదరు. అప్పుడే అది పరి పూర్ణము అగును. దాని శక్తి అమోఘము. అర్హత లేని వారికి ఇలా బీజ రహిత మంత్రములను ఇచ్చెదరు. ఇది గురువులు తమ శిష్యులను పరీక్షించి, వారి స్థాయిని బట్టి ఇచ్చెదరు. అందుకే సద్గురువులు కావలెను అని అందురు.

౨ ఉదాహరణకు తీసుకుంటే శ్రీరామరక్షాస్తోత్రానికి సీత శక్తి, హనుమంతుడు కీలకం అంటారు. బీజం చెప్పలేదు. అలాంటప్పుడు బీజమేమిటో ఎలా తెలిసేది? సాధనద్వారా మాత్రమే తెలిసే విషయాలా ఇవి?

అంతర్లీనంగా, అంతర్గతముగా రామ బీజము ఇందులో కలదు. ప్రకటితముగా చెప్పబడలేదు. కానీ ప్రాచీన హిందీ, సంస్కృత ప్రతులలో బీజము చెప్పబడివున్నది.
ఇది కూడా మంత్ర రహస్యమును కాపాడ దానికే పెద్దలు, గురువులు ఇలా చేస్తూ వుంటారు. గురు ముఖ:ముగా వచ్చినప్పడు మంత్రముగానీ, స్తోత్రము గానీ పూర్తి స్థాయిలో చెప్పబడుతుంది. లేదంటే అన్యుల చేతికి దొరికినప్పుడు చాలా ప్రమాదము సంభవించును. ఇవన్నీ formula లాంటివి. బ్రహ్మాస్త్రముల formula ఇతరులకు దొరకకూడదు. దాని వలన చాలా అనర్ధములు కలుగును. అందుచేత మన ఋషులు చాలా గుప్తముగా ఉంచినారు మంత్ర శాస్త్రమును.
తారక మంత్రము ఏక బీజాక్షరము. బీజాక్షరములలో ఏకము చాలా శక్తిమంతమైనది. దానిని తట్టుకోవడము చాలా కష్టము. అందు చేత దాని శక్తిని తగ్గించడానికి మరి రెండు మూడు బీజాక్షరములను సంపుటీకారణము చేసి మంత్రమును ఇచ్చెదరు.
రామ మంత్రమునకు బీజము రాం. అదే తారకము, వాల్మీకి, మారుతి జపించినది  ఈ బీజాక్షరమునే. మహా శక్తివంతమైనది ఈ రాం బీజము. అతి గుహ్యమైనది. ఉపదేశము లేకుండా బీజాక్షరములు చేయకూడదు. తట్టుకొనే శక్తి లేకపోతే ప్రమాదము. Mind un balance అవుతుంది. అంతర్లీనంగా శ్రీ రామ రక్షా స్తోత్రములో గలదు. సాధన చేత, ఉపాసన చేత, గురువుల అనుగ్రహము చేత దీనిని దర్శించ వలెను.

౩ మంత్రానికి ఉండే బీజశక్తికీలకాలకూ స్తోత్రానికి ఉండే బీజశక్తికీలకాలకూ భేదముందా?

దేనికి దానికి వేరుగా వుంటాయి. మంత్ర మంత్రమునకు ఇవి మారుతూ వుంటాయి. అలాగే స్తోత్రమునకు కూడా. అవి వేరు ఇవి వేరు.

౪ మంత్రాలలో కూడా మంత్రమనీ, మహామంత్రమనీ, మాలామంత్రమనీ ... ఈ భేదాలేమిటి?

అన్నింటినీ మంత్రములు అని అందురు. 24 అక్షరముల కంటే ఎక్కువ వున్న మంత్రములను, మరియు మోక్ష మంత్రములను ...మహా మంత్రములు అని అందురు.
మాలా మంత్రము అంటే కొన్ని వాఖ్యములు కోన సాగే మంత్రములను మాలా మంత్రములు అని అందురు. దండలాగా వుంటుంది. దీనికి ఉదాహరణలు నేను తరువాత చెబుతాను. ప్రత్యన్గిరా, చండీ, బగళ మంత్రములకు ఇలా మాలా మంత్రములు గలవు.

౫ మీరు చెప్పిన దుర్గాచండీమహామంత్రమంటే దుర్గాసప్తశతి అనా?

దుర్గా చండీ సప్తశతి యొక్క మూల మంత్రము చండీ మంత్రము అని అందురు. దీనినే కొంత సంపుటీకరణముతో, బేధముతో మహా చండీ కూడా గలదు.
చండీ మంత్ర ఉపదేశము లేనిదే చండీ సప్తశతి, (దుర్గా సప్తశతి) చేయకూడదు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి యొక్క త్రిశక్తి స్వరూపమే చండీ స్వరూపము.

౬ నాదబిందుకళలంటారు. అవేమిటి?

ఇది శ్రీవిద్యలో చెప్పబడుతుంది. ఇతరులకు చెప్పకూడదు. గురు ముఖ:త తెల్సుకోవలెను. కొన్ని విషయములను బహిరంగముగా చెప్పకూడదు. చాలా ప్రమాదము. సరిగా అర్ధము చేసుకోలేరు. భావన తప్పు వస్తుంది. ముందు నాదం అర్ధం చేసుకో. అవతల వాటి కళలు గురించి తెలుసుకొనేదవూ. ప్రకృతిని ఆరాధించడం తెలుసుకో. ప్రకృతిని అధ్యయనం చేయి.

మంత్ర శాస్త్రములో కొన్ని విషయములను ఎవరకి వారు సాధన ద్వారా తెలుసుకోవలెను. ఇతరులు చెబితే అర్ధము గాదు. మెలుకవులు గురువులు చెప్పుదురు.
దారి గురువులు చూపించేదారు, నడవ వలసినది మనము. మనము వెళ్లి తెలుసుకోవాలి.

మీ
శ్రీ భాస్కరానంద నాథ
శ్రీవిద్యా పూర్ణదీక్షాపరులు..

Monday 15 August 2016

శ్రీవిద్యోపాసకులు

శ్రీవిద్యోపాసకులు ఎప్పుడూ తర్కించరు, వాదించరు, తప్పును ఖండిస్తారు,  చూపిస్తారు. విని తెలుసుకొంటే ఉత్తములు అవుతారు...లేదంటే ఎవరి కర్మ వాళ్లు అనుభవిస్తారు. నిత్యం మహా షోడశిీ మంత్ర జపంలో రమిస్తూ వుండే వాళ్లకి ఆడ, మగ అనే తేడా వుండదు. చిన్న పెద్ద తేడా కనిపించదు, అందరూ బాలా త్రిపుర సుందరులుగా 8 ఏండ్ల బాలబాలికలుగా కనిపిస్తూవుంటారు. ఏవ్వరి మీద అక్కసు, ద్వేషం, పగ అసలు వుండదు....పగ కక్షలు వున్న వారి దగ్గరకు కామాక్షి రాదు....అమ్మ మాతృ స్వరూపిణి...కావున అమ్మను పూజించే వాళ్లు కూడా మాతృ సమానులౌతారు. శ్రీవిద్యోపాసకులకు కల్లాకపటం తెలియదు ఎందుకంటే వాళ్లు బాలా స్వరూపులుగా, వున్నది వున్నట్లుగా మాట్లాడుతూ వుంటారు. వ్యక్తిగత పగలు ద్వేషాలు తెలియవు వారికి. సమస్త ప్రాణి కోటిని అష్టావర్ష భవేత్ అన్నట్లుగా 80 ఏండ్ల ముసలి వాళ్లు కూడా 8 ఏండ్ల బాలికామణిలాగ కనిపిస్తూ వుంటుంది. అదే శ్రీవిద్యోపాసన....నరనరాలలో అమ్మ తనం నిండిపోయివుంటుంది...జగన్మాత లాగ మాట్లాడుతూ వుంటారు.....ప్రపంచంలో వున్న కుళ్లు కుతంత్రాలను చూసి బాధపడుతూ వుంటారు, ఓక్కోసారి ఆనంద తాండవం చేస్తూ వుంటారు....కడు విచిత్రంగా ప్రవర్తిస్తూవుంటారు....మన భావనలకు అందరు...ఎవ్వరినీ గుర్తు పెట్టుకొని పగ సాధించడం అనేది అసలు వుండదు, అహంకారం వుండదు.
ఈ లక్షణాలతో అంబ పూజ చేయలేరు, నిత్య శ్రీచక్రార్చన చేయలేరు.....ఎవరిలో ఈ దుర్గుణములు వుంటాయో వారు శ్రీచక్రం ముందు కూర్చోలేరు.....తప్పు చేస్తే నెత్తి కొడుతుందని దేవీ ఉపాసకులకు బాగా తెలుసు....గురుపరంపరకు మచ్చ రానీయరు.  సాంప్రదాయ శిష్య పరంపరలో వచ్చిన ఉపాసకులను అనుక్షణం వారి గురు దేవుళ్లు, గురు త్రయం కాపాడుతూ వస్తుంది....చేసిన పొరబాట్లను గురించి తక్షణమే వారికి స్వప్న రూపంలో సమాధానాలు దొరుకుతూవుంటాయి.
శ్రీవిద్యా పూర్ణదీక్షాపరుల యోక్క మానసిక స్థితి కడు బిన్నముగా వుంటుంది...వారు అన్న ప్రతి మాటకూ ఓక అర్థం వుంటుంది....అర్థం లేకపోతే అర్థం కల్పిస్తుంది ఆ కామాక్షి ...అది ఆమే భాధ్యత.
వీరు అహంకారంతో, ఆగ్రహంతో ఏప్పుడూ మాట్లాడరు.....అయితే అలా కనిపిస్తూ వుంటారు కారణం వారి వెనుక శ్రీ భవానీ వున్నది అని నమ్మకంతో....వీరు నిద్రపోయేటప్పుడు అమ్మ ఓడిలో పడుకొని నిద్రపోతారు....పూర్ణవిద్యాపరులు అంటే సాక్షాత్తు స్వయం కామాక్షీ స్వరూపులు. ఆ స్పృహలోనే నిత్యం వారు మెదులుతూ వుంటారు,  కావున వారు అన్న మాటలు నిత్య సత్యాలు అవుతాయి...
అహం భావయే భవానీం....అని ఊపిరి పీలుస్తూ వుంటారు....అటువంటి భవానీ స్వరూపమునకు కొందరిమీద కాఠిన్యం, కొందరి మీద లాలిత్యం వుండదు....శ్రీవిద్యోపాసకులతో మాటలాడే వ్యక్తుల యోక్క భావనలు తమంతట తాముగా బయట పడుతాయి....అందుకొని చాలా జాగ్రత్తగా మసలుకోవాలి....ప్రకృతిని శాసించే మంత్ర శక్తులు వీరి దగ్గర ఎక్కువగా వుంటాయి.....వీరి శరీరం మంత్రపూరితం అయ్యి వుంటుంది, పైకి అతి సాధారణముగా కనిపించినా లోన అతీంద్రియ శక్తులతో మూల ప్రకృతితో తాదామ్యత చెంది అణుసంధానమై వుంటారు...అందుకే తమలో తాము నవ్వుకొంటూ వుంటారు....నీవు పొగడినా, తిట్టినా ఒక్కటే విధముగా నవ్వుతూ వుంటారు.
చిన్న పిల్లల మనస్త్వత్వంతో ఆడుతూ పాడుతూ వుంటారు.....
కరుణ కలిగితే అపారమైన సహాయం చేస్తారు, తమ పుణ్యం కూడా ఆఖరాకి తమ ప్రాణాలు సహితం ధారపోస్తారు.....అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటి వారి ప్రాణాలు తీయరు. కారణం అమ్మ ప్రాణ స్వరూపిణి, మాతృ స్వరూపిణి ....ప్రాణాలు ఇవ్వడమే వీరి లక్ష్యం.....పూర్ణ దీక్షాపరులైన శ్రీవిద్యోపాసకులు మనతోనే తిరుగుతూ గుంభనంగా సాధన చేస్తూ వుంటారు....ఇటువంటి వారికి ఓక్కపూట భోజనం పెట్టినా లేక ఒక్క అనరాని మాట అన్నా అది వెయ్యింతల ఫలితాన్ని ఇస్తుంది....
శ్రీచక్రోపాసన అంటే సమస్త సృష్టిని, సమస్త లోకాలను,  ముక్కోటి దేవతలను త్రిశక్తి సహిత త్రిమూర్తులను, ఆ కామకామేశ్వరులను ఏకకాలంలో అర్చించినట్లు లెక్క.....
సాక్షాత్తు శ్రీదేవీ స్వరూపమైన శ్రీవిద్యోపాసకులు ఓక్క వారి గురువలకు తప్పించి లోకంలో మరెవ్వరి పాదములకూ నమస్కరించరు.....ప్రతి ప్రాణిలోనూ మాతృ భావన చేసి, మాతృ మూర్తిగా దర్శిస్తూవుంటారు.....వీరి శరీరభాగములలో శ్రీదేవి నాట్యమాడుతూ వుంటుంది...అదే శ్రీవిద్యోపాసన.
చాలా చాలా కష్టమైన విద్య.......నిలుపుకోవడం చాలా కష్టం..

వీరు ఏవ్వరి దగ్గర నుంచీ ఏమీ ఆశించరు....వీరికి కావలసిన వన్నీ అమ్మ సమకూర్చి పెడుతూ వుంటుంది...నోటిలోమాట నోటిలో వుండగానే సకలాభీష్ఠదాయిని తధాస్తు ..అని అంటుంది.
వీరు కదులుతూ వుంటే అమ్మ వారు కదులుతూ వుంటుంది....ఆర్తి వీరి కళ్ళల్లో,  మాటలలో కనిపిస్తూ వుంటుంది. అమ్మతనం వీరి చేతలలో కనిపిస్తూ వుంటుంది.

పాదుకాంత పూర్ణదీక్షాపరులుగా వున్న వారిని మనం వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును....పూర్వ జన్మ సుకృతం, పుణ్యఫలం, గురువుల అనుగ్రహం లేకపోతే పూర్ణదీక్ష రాదు....వచ్చినా నిలబడదు...
ఇది యోగ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య....
అటువంటి మహా యజ్ఞమును చేస్తున్న మహా పురుషులకు నమస్కరిస్తూ....